Chandranna Bima Scheme News: ఏపీ ప్రభుత్వం పేదలందరికీ వర్తించేలా చంద్రన్న బీమా పథకం అమలుకు సిద్ధమవుతోంది. 18-70 ఏళ్ల వయస్కులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల బీమా మొత్తం చెల్లించాలనే ఆలోచనలో ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటోంది.. బీమా మొత్తాన్ని కూడా పెంచుతోంది. ఈ మేరకు రెండు విధానాలపై ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు వచ్చాయి. ప్రభుత్వం ఎటువైపు మొగ్గుచూపుతుందో చూడాలి.