AP Govt Cashless Tax Collection: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తి పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఇకపై ఆన్లైన్లోనే డిమాండ్ నోటీసులు జారీ చేస్తారు. నగదు రహితంగా పన్నులు చెల్లించేందుకు అవకాశం కల్పిస్తారు. అలాగే ఆన్లైన్, వాట్సాప్ ద్వారా పన్నులు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు. పన్నుల విధానంలో పారదర్శకత పెంచడానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్లో రికార్డులను అప్లోడ్ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లలో అవకతవకలు జరగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.