ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మరో రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలపై మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఈ రెండు పథకాలను ఎప్పటి నుంచి అమలు చేస్తామనే దానిపై మంత్రి లోకేష్ మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. మరోవైపు వైసీపీ హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడిపోయిందన్న లోకేష్.. తాము తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.