AP Govt CPS Employees Money Released: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉగాది పండగ ముందే వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉద్యగులకు బకాయిలు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంటును కూటమి ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. గత నెల వరకు ఉన్న మొత్తాన్ని ప్రాన్ ఖాతాలకు జమ చేసింది. ఇది 17 ఏళ్లల తర్వాత మొదటిసారి అంటున్నారు. ఈ మేరకు సీపీఎస్ ఉద్యోగుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. రూ.2,300 కోట్ల డీఏ బకాయిలు చెల్లించారు.