AP Govt Employees Changes In Da Go: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన డీఏ బకాయిల చెల్లింపుపై కీలక మార్పులు చేసింది. దీపావళి జీవోలో సవరణలు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ బకాయిల్లో 10% 2026 ఏప్రిల్లో, మిగిలిన 90% మూడు వాయిదాల్లో చెల్లిస్తారు. ఓపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాల్లో, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లింపులు జరుగుతాయి. ఈ మార్పులపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.