AP Govt Rs 70 Collect From Auto Drivers: ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రూ.70 వసూలు చేస్తోందని.. ప్రతి రోజూ ఈ వసూళ్లు ఉంటున్నాయని సోషల్ మీడియాలో ఓ రశీదు వైరల్ అవుతోంది. నందమూరి బాలయ్య ప్రాతినిధ్య వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి వసూళ్లు ఇవేనంటూ రశీదును కొందరు ట్వీట్చేశారు. మరి నిజంగానే ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల నుంచి రూ.70 వసూలు చేస్తోందా.. అసలు నిజం ఏంటో తెలుసుకుందాం..