ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో యువతకు నైపుణ్య శిక్షణ అందించేందుకు ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా పదివేల మంది విద్యార్థులకు ఏఐ శిక్షణ ఇవ్వడంతో పాటు, 500 అంకుర పరిశ్రమలకు మద్దతు లభిస్తుంది. అంతేకాకుండా, అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఎన్విడియా సహకరించనుంది. మరోవైపు దేశంలోనే తొలిసారిగా క్వాంటం వ్యాలీ టెక్ పార్కును కూడా ఏర్పాటు చేయనున్నారు.