ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోయ భాషలో విద్యాబోధనకు ఊపిరిలూదేలా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అల్లూరి జిల్లాలోని గోదావరి, శబరి తీర ప్రాంతాలలోని 12 పాఠశాలల్లో కోయ భాషను బోధించడానికి నేటివ్ స్పీకర్లను నియమించాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ గిరిజన, సంక్షేమ శాఖ.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. గ్రామాల్లో కోయ భాష మాట్లాడేవారిని నేటివ్ స్పీకర్లుగా నియమించాలని సూచించింది.