ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లాలోని రాయలచెరువుకు గండి పడిన ఘటనలో బాధితులకు పరిహారం అందించనుంది. మొత్తం 960 కుటుంబాలకు పరిహారం అందించేందుకు రూ.3.23 కోట్లు నిధులు మంజూరు చేసింది. రాయల చెరువుకు గండిపడటంతో నష్టపోయిన 960 కుటుంబాలకు.. కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున ఈ పరిహారం అందించనున్నారు. ఈ నగదు సాయంతో పాటుగా నిత్యావసర వస్తువులు కూడా అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.