ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఆతిథ్య రంగం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజులను ఏడాదికి ఐదు లక్షలుగా నిర్ధరించింది. అలాగే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా తగ్గించింది త్రీస్టార్ హోటల్స్, అంతకంటే పైస్థాయి హోటల్స్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఏడాదికి రూ.66 లక్షలు నుంచి రూ.25 లక్షలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం సెప్టెంబర్ నుంచి అమల్లోకి రానుంది.