Andhra Pradesh Land Value Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సుమారు 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇది ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వ ఆదాయాన్ని పెంచడంతో పాటు, వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వ విలువకు మధ్య తేడాను తగ్గించడం దీని లక్ష్యం. ఈ సవరణలు రియల్ ఎస్టేట్తో పాటు ప్రజల లావాదేవీలు, ప్రభుత్వ ఆదాయాలపై తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి అంటున్నారు.