ఏపీ ప్రభుత్వం కొత్త ఆలోచన.. ఇక ప్రతి మండలంలోనూ.. ఆర్థిక సాయం కూడా..కేబినెట్‌లో నిర్ణయం

4 months ago 12
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 20 నుంచి 30 వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వర్క్ స్టేషన్ల ఏర్పాటు కోసం ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసుకునేందుకు వీలుగా.. ఈ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్క్ స్టేషన్ల ద్వారా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వెసలుబాటు కలుగుతుంది. అటు వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం నుంచి సాయం, ఉపాధి లభించనుంది.
Read Entire Article