ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఇచ్చినవారికి సరుకులు ఉచితంగా అందించే స్వచ్ఛ రథాలను తీసుకువచ్చింది. పంద్రాగస్టు రోజున రాజమహేంద్రవరంలో మంత్రి కందుల దుర్గేష్ ఈ స్వచ్ఛ రథం ప్రారంభించారు. దీని ద్వారా ఇళ్లల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. వాటిని లెక్కగట్టి అందుకు సమాన విలువ కలిగిన నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తారు.