తమది పేదల ప్రభుత్వమని.. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ మేరకు అన్నమయ్య జిల్లాలో 3 లక్షల గృహాలను వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా.. ముఖ్యమంత్రి ప్రసంగించారు. కాగా, మరో 5.9 లక్షల ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామివేత్త ఉండటమే తమ లక్ష్యమని.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. నదుల అనుసంధానం తన జీవితాశయం అన్నారు చంద్రబాబు.