రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా బోధన అందించేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. మన సర్కారీ బడులలో ప్రపంచస్థాయి బోధనా పద్ధతులు అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా గతేడాది బెస్ట్ టీచర్ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పర్యటనకు పంపించనున్నారు. ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 29 మంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించి అక్కడి బోధనా పద్ధతులను అధ్యయనం చేయించనున్నారు.