రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీప్లేన్ సేవలు ప్రారంభించనుంది. దీనికోసం ఎనిమిది ప్రాంతాలను ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.. దీనికి సంబంధించిన విషయాలను ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ APADCL చూడనుంది. పర్యావరణ అనుమతులు తీసుకోవడం, విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను కూడా వారే చూస్తారు. ఈ సీప్లేన్ సేవలు రవాణా సౌకర్యం లేని పర్యాటక ప్రాంతాలకు ఎంతగానో ఉపయోగపడతాయి.