రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్స్టేలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 500కు పైగా హోమ్స్టేలను గుర్తించి, 2025 ఆగస్టు నాటికి ఆధునీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అరకు, కోనసీమ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేయనున్నారు. స్థానిక సంస్కృతిని పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు, స్థానికులకు ఉపాధి కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. త్వరలోనే రాష్ట్ర హోంస్టే పాలసీని తీసుకురానున్నారు.