గత వైసీపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీలను.. పీపీపీ మోడ్లో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని ప్రతిపక్ష వైసీపీ వ్యతిరేకిస్తోంది. ఈ విషయంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా కేఏ పాల్ పిటిషన్ను కొట్టేసిన సుప్రీం కోర్టు.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ప్రచారం కోసమే పిటిషన్లు వేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే గతంలోనూ పలు విషయాలపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది.