వీకెండ్ వచ్చిదంటే చాలు.. హైదరాబాద్లో నివాసముంటున్న ఏపీ ప్రజలు సొంతూళ్లకు ప్రయాణమవుతుంటారు. దీంతో.. హైదరాబాద్ రైల్వేస్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చర్లపల్లి నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఫిబ్రవరి 28 నుంచే ఈ ప్రత్యేక రైళ్ల సేవలు అందుబాటులోకి రానున్నట్టు అధికారులు వివరించారు.