ఏపీ ఫైబర్నెట్ కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫైబర్నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఫైబర్నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేయడం, ఆ తర్వాత ఫైబర్నెట్ ఎండీగా ఉన్న దినేష్ కుమార్ను ప్రభుత్వం బదిలీ చేయడం సోమవారం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.