ఏపీ మంత్రి సుభాష్‌కు తప్పిన ప్రమాదం.. సిబ్బంది అప్రమత్తతతో..

1 year ago 25
ఏపీ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కాకినాడ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి మంగళవారం మంత్రి సుభాష్ హాజరయ్యారు. అనంతరం వేదిక మీదకు చేరుకున్నారు. అయితే వేదిక మీదకు ఎక్కువ మంది చేరుకోవటంతో వేదిక ఒకవైపు ఒరిగిపోయింది. దీంతో మంత్రి కిందకు పడబోయారు. అయితే ఆయన భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆయనను కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో వేదిక మీద కార్యక్రమాన్ని కొనసాగించారు.
Read Entire Article