Andhra Pradesh Temple Get Rs 22 Crores With Mana Mitra: రాష్ట్రంలో ప్రధాన ఆలయాలకు సంబంధించిన దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల్ని మనమిత్ర వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. భక్తులు వాట్సాప్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఆదాయం పెరిగింది. రాష్ట్రంలో 21 ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్లో దర్శనాలకు టికెట్లు బుక్ చేసుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఏకంగా రూ.22.26 కోట్ల ఆదాయం వచ్చింది