Apsrtc Free Bus Travel Allowed In Temple Special Buses: ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం విజయవంతంగా అమలవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించిన ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రారంభమైన మూడు రోజుల్లోనే 13.30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీని ద్వారా వారికి రూ.5.46 కోట్ల వరకు లబ్ధి చేకూరింది. దేవాలయాలకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతిస్తూ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.