ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం.. బిగ్‌ అప్‌డేట్.. ఆ విధానమే అమలు.!

7 months ago 23
AP Free bus Scheme: ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఆగస్ట్ 15 నుంచి అమలు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకంపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా జీరో ఫేర్ టికెట్లు జారీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ జీరో ఫేర్ టికెట్ మీద ప్రయాణం వివరాలతో పాటుగా ఎంత మేరకు ఆదా అయ్యిందనే వివరాలను ముద్రించాలని.. అందుకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
Read Entire Article