రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భరోసాను అందించడంతో పాటుగా వారి సామాజిక, మానసిక ఇబ్బందులకు కూడా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జెండర్ రిసోర్స్ సెంటర్స్ పేరుతో రాష్ట్రవ్యా్ప్తంగా అన్ని నియోజకవర్గాలలో కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ జీఆర్సీ కేంద్రాల ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక, మానసిక ఇబ్బందులకు పరిష్కారం చూపించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.