ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన మరో పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్ బేబీ కిట్ పేరుతో ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవం అయిన తల్లులకు కిట్లు అందించేవారు. 2016లో ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ పథకం ప్రారంభించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావటంతో బేబీ కిట్ పథకం ఆగిపోయింది. అయితే నవజాత శిశువుల సంరక్షణ, ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని మళ్లీ తేవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.