Vijayawada Ayodhya Varanasi Vande Bharat Sleeper Train: దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో, ఇప్పుడు స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఈ స్లీపర్ రైళ్లు వస్తాయా లేదా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ వస్తే, ఏయే రూట్లలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ నుండి అయోధ్యకు ఒక రైలు, సికింద్రాబాద్ నుండి తిరుపతికి మరొక రైలు ఉండొచ్చని అంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి!