రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసి మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం యునిసెఫ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో జరిగిన మసావేశంలో ఎంవోయూపై యునిసెఫ్ ప్రతినిధులు, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు సంతకాలు చేశారు.