రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసి, వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు అనేర చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా వసుధ ప్రాజెక్టును చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని యువతకు విదేశీ భాషలను నేర్పించి.. విదేశీ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేలా చేయాలనేది ప్రభుత్వం ఉద్దేశం. అందులో భాగంగా ఇప్పటికే విద్యా్ర్థులకు జర్మన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్ వంటి భాషలు నేర్పించేందుకు శ్రీకారం చుట్టారు. తొలుత గవర్నమెంట్ కాలేజీల్లోని భాషా పండితులకు ఈ భాషలు నేర్పించి.. వారి ద్వారా కాలేజీ విద్యార్థులకు నేర్పించే ఆలోచనలు చేస్తున్నారు.