Rajnath Singh Call To Ys Jagan: ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏపీ మాజీ సీఎం జగన్తో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. రాధాకృష్ణన్ అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరారు. దీనిపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జగన్ తెలిపారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ఖరారయ్యారు. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నడ్డా విపక్షాలకు పిలుపునిచ్చారు. రాధాకృష్ణన్ దక్షిణాది బీజేపీలో సీనియర్ నాయకుడు కావడంతో ఆయనకు అవకాశం దక్కింది.