ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీలో చేరాలని జనసేన పార్టీ మాజీ నేత నిర్ణయం

6 months ago 5
Patamsetti Suryachandra To Join BJP: జనసేన పార్టీలో పదేళ్ల పాటూ పనిచేసిన నేత బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 2019 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయిన పాటంశెట్టి సూర్యచంద్ర బీజేపీలోకి వెళుతున్నారు. ఆయన 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పనిచేయడానికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సూర్యచంద్ర తెలిపారు. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Entire Article