ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పూనిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ ఒకే నిర్ణయం తీసుకున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. అటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఆయనకే మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో రెండుపార్టీలూ ఒకే నిర్ణయం తీసుకున్నట్లైంది. మరోవైపు తగినంత సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.