ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్.. ఒకే మాటపై టీడీపీ, వైసీపీ.!

10 months ago 16
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పూనిప్పులా ఉండే టీడీపీ, వైసీపీ ఒకే నిర్ణయం తీసుకున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి వెల్లడించారు. అటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఆయనకే మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో రెండుపార్టీలూ ఒకే నిర్ణయం తీసుకున్నట్లైంది. మరోవైపు తగినంత సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో సీపీ రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Read Entire Article