Kusuma Krishna Murthy Passed Away: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మూడుసార్లు ఎంపీగా గెలిచిన ఆయన, ఆరు, ఏడు, తొమ్మిదవ లోక్సభల్లో ప్రాతినిధ్యం వహించారు. అలాగే పలు కీలక పదవుల్లో పనిచేశారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.