ఏపీలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూటమి పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇందులో మూడు తెలుగుదేశం, ఒకటి జనసేన పార్టీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి. జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్ పేరు దాదాపుగా ఖరారైంది. అధినేత పవన్ కళ్యాణ్ దీనిపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అయితే టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఎవరనేదీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేసులో పలువురు సీనియర్ నేతలు, యువ నాయకులు ఉండటంతో చంద్రబాబు మనసులో ఎవరున్నారనే విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.