రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెరిగిన ధరల నేపథ్యంలో, ఇప్పుడు గోధుమ పిండిని కేవలం రూ.20కే అందించేందుకు ముందుకు వచ్చింది ఫిబ్రవరి 1 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. బయట మార్కెట్లో కిలో రూ.50 ఉన్న గోధుమ పిండిని.. రేషన్ దుకాణాల్లో రూ.20కే ఇవ్వడం సామాన్యులకు ఎంతో మేలు చేస్తుందంటున్నారు. ఇది రేషన్ కార్డుదారులకు నిజంగానే భారీ శుభవార్త. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.