Annadata Sukhibhava Scheme Money Release: ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్లో నిధుల్ని కేటాయించింది.. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాజాగా శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద.. ప్రతి ఏటా అర్హత ఉన్న రైతులకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.