ఏపీని మొంథా తుఫాను వణికించిన సంగతి తెలిసిందే. తుఫాను కారణంగా భారీ నష్టం సంభవించింది. ముఖ్యంగా పంటలు దారుణంగా దెబ్బతిని రైతులు లబోదిబోమంటున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనా వేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంట నష్టం వివరాల నమోదు గడువును ఏపీ ప్రభుత్వం మరో రెండు రోజులు పొడిగించింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.