Andhra Pradesh Govt Urea Link With E Crop: రైతులకు యూరియా కొరత, దుర్వినియోగం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ సీజన్ నుంచి ఆధార్ అనుసంధానంతో కూడిన కొత్త పంపిణీ విధానాన్ని అమలు చేయనుంది. ఈ-పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా లభిస్తుంది. తద్వారా అవసరమైన వారికి సకాలంలో ఎరువులు అందించి, దుర్వినియోగాన్ని అరికట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రైతులంతా ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచిస్తున్నారు.