ఏపీలోని రైతులకు తీపికబురు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతోంది. ఈ విషయాన్ని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ ఎంత మేరకు ధాన్యం కొనుగోలు చేశామనే వివరాలను, ఎంత మంది రైతుల అకౌంట్లలోకి డబ్బులు జమ చేశామనే వివరాలను మంత్రి వెల్లడించారు. మరోవైపు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాట్సాప్ చాట్ బోట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ధాన్యం అమ్మాలనుకునే రైతులు ఇందులో హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా షెడ్యూల్ చేసుకోవచ్చు.