Andhra Pradesh Farmers Can Use Dig Soil: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రైతులు చెరువులు, జలాశయాల నుండి పూడిక మట్టిని సొంత ఖర్చులతో తీసుకుని వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చు. కాలువల పనులు మే నెలాఖరుకు పూర్తి చేయాలని, నీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నిర్వహణ పనుల్లో భాగంగా రూ.10 లక్షల వరకు పనులను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతించింది.