Annadata Sukhibhava 2nd Installment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. అయితే పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19న విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా నవంబర్ 19వ తేదీన విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.