Andhra Pradesh Farmers Pattadar Passbook On August 15tth: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఆగష్టు 15 నుంచి 31 వరకు పంపిణీ చేయనుంది. గతంలో సీఎం జగన్ ఫోటోతో ఉన్న పాస్బుక్లను మార్చి, రాజముద్రతో కొత్త పుస్తకాలను తయారు చేశారు. దశలవారీగా 10 లక్షల మంది రైతులకు ఈ పాస్బుక్లను అందిస్తారు. వీటిలో రైతు ఫోటో, భూమి వివరాలు, క్యూఆర్ కోడ్ ఉంటాయి.