ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు జూన్ 20వ తేదీ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన 23వ విడత నిధులను జూన్ 20న విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కలిపి అమలు చేస్తున్న నేపథ్యంలో జూన్ 20వ తేదీనే డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలలో జమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం తప్పుల సవరణకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.