Visakhapatnam Express Trains Cancelled: ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు గమనిక! తాడి-దువ్వాడ స్టేషన్ల మధ్య మరమ్మత్తుల కారణంగా ఆగస్టు 26 నుండి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ-విశాఖపట్నం, కాకినాడ-విశాఖపట్నం, రాజమండ్రి-విశాఖపట్నం మధ్య నడిచే ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేయబడ్డాయి. విజయవాడ, గూడూరు సెక్షన్లో మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించగలరు.