ఉమ్మడి కడప జిల్లాలోని కడప, రాజంపేట రైల్వే స్టేషన్లలో.. అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. కడప రైల్వే స్టేషన్లో సవరించిన అంచనాలతో పనులు జరుగుతున్నాయి. ఈ స్టేషన్ వచ్చే ఏడాది చివరి నాటికి అత్యాధునిక హంగులతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట స్టేషన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. పార్కింగ్ స్థలంతో పాటు డిస్ప్లే బోర్డులు, ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేయడం వంటి పనులు ఇప్పటికే చేపట్టారు. రాజంపేట స్టేషన్ తర్వలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.