ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో దీనిపై దర్యాప్తునకు సిట్ను నియమించారు. సిట్ దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్లో డొంక కదిలింది. శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో ఏసీబీ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అట్టపెట్టల్లో దాచిన ఈ మొత్తాన్ని రూ.11 కోట్లుగా అధికారలు తేల్చారు.