AP Kallu Geetha Workers Get Bikes Under Adarana 3.0 Scheme: ఏపీలో త్వరలో 'ఆదరణ 3.0' పథకం ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఆదరణ పథకం ద్వారా కల్లు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు, అత్యాధునిక పరికరాలు అందిస్తామని తెలిపారు. రంపచోడవరంలో తాటి ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. కులవృత్తుల వారికి 90 శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామని, లబ్ధిదారులు 10 శాతం మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు. వివిధ కులవృత్తుల వారు కోరుకుంటున్న పరికరాల జాబితాను కూడా మంత్రి వెల్లడించారు.