హైదరాబాద్- విజయవాడ విమాన టికెట్ ధరలు, సీట్ల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఇటీవల టీడీపీ ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి ఇటీవల తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ నేపథ్యంలో త్వరలో విజయవాడ-హైదరాబాద్ మధ్య వైడ్ బాడీ విమానాలు రాకపోకలు సాగించనున్నామని ఇండిగో ప్లైట్ స్పెషల్ డైరెక్టర్ ఏకే సింగ్ తెలిపారు. దీంతో టికెట్ ధరలు తగ్గి, సీట్లు పెరిగుతాయి. అలాగే ప్రయాణికులకు లగేజీ సమస్య కూడా తీరుతుంది.