ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. నాలా చట్టం రద్దు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో 2006 నుంచి ఉన్న బకాయిలను అపరాధ రుసుం లేకుండా చెల్లించే అవకాశం కల్పించనుంది. ఈ విషయాన్ని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వన్ టైన్ ఆప్షన్ కింద నాటి రిజిస్ట్రేషన్ విలువలతోనే బకాయిలు చెల్లించేందుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి సత్య ప్రసాద్ తెలిపారు. నాలా చట్టం రద్దుపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామన్నారు.