ఏపీలో కొత్త మోటార్ వాహనాల చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి భారీ జరిమానాలు విధించనున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడపటం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, అతి వేగం, సిగ్నల్ జంపింగ్ వంటి సమయాల్లో భారీగా జరిమానాలు విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించేలా చూడాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టం అమల్లోకి తెచ్చారు.